కృష్ణా జల వివాదంపై కేసీఆర్ మెలిక... గెజిట్ అమలవుతుందా...?
కేంద్ర జల శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై అధ్యయనం చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తర్వాత... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మించబోతున్న ప్రాజెక్టులపై రాష్ట్ర విభజన ముందు నుంచే వివాదాలు ఉన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా ఫిర్యాదు చేసింది కేసీఆర్ సర్కార్. అదే సమయంలో ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలతో సంబంధం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో చేసేది లేక... తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి జగన్ సర్కార్ ఫిర్యాదు చేసింది. జగన్ లేఖపై స్పందించిన కేంద్రం... కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా తమ పరిధిలోకి తీసుకుంటీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రివర్ బోర్డు పరిదిలోకి రెండు రాష్ట్రాల్లోని కృష్ణా నది ప్రాజెక్టులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది.