తల్లితండ్రుల్లో "అమ్మఒడి" ఆందోళన?
దీనికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు పూర్తయ్యే లోపు మాత్రమే చెల్లించాలని ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇది తల్లితండ్రులపై భారం పడనుంది. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, గడిచిన రెండు సంవత్సరాల నుండి హాజరు నియమం ఉంది. కానీ ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తోంది అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే తల్లితండ్రులు మాత్రం జనవరి లోనే అమ్మ ఒడి డబ్బులు వేయాలని ఆశిస్తున్నారు.
కొందరు మాత్రం రాష్ట్రంలో ఖజానా ఖాళీ అవడం వలనే జగన్ ఆలస్యం అవుతుందని ముందుగానే హాజరుని కారణంగా చూపి ప్రిపేర్ చేస్తున్నాడని అంటున్నారు. మరి వారి కోరిక తీరుతుందా? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పరిస్థితి ఏమిటి ? జగన్ తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా? అన్న పలు ప్రశ్నలకు సమాధానం కావాలంటే జనవరి వరకు ఆగాల్సిందే..