ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసిన అనంతరం ఎపీ జేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు ఆసక్తి కర వ్యాక్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చామని.. మా సమస్యల పరిష్కారంపై సజ్జల సానుకూలంగా స్పందించారన్నారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని సజ్జల హామీ ఇచ్చారని.. సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎస్ సమీర్ శర్మను కలుస్తామని తెలిపారు.
దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఆశిస్తున్నాయని... పీఆర్సీని త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారని వెల్లడించారు. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదని.. ఎవరైనా చనిపోతే ఖర్చులకూ డబ్బులు రావడం లేదన్నారు. 1న వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరామని... మెడికల్ అండ్ హెల్త్ లో ప్రమోషన్ల పై సజ్జల సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.
ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం..ఇంకా ఇవ్వలేమని చెప్పామని.. మాపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అ యింది డెడ్ లై న్ దాక రాలేదని..చెప్పారు. ఎపీ జెఎసీ ఛైర్మన్ బొప్ప రాజు మాట్లా డుతూ... 10 ప్ర ధాన సమస్యలను మెమోరాండం రూపంలో సజ్జలకు ఇచ్చా మని.. జీతాలు, పెన్షన్లు చాలా లేటుగా వస్తున్నాయన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేయాలని కోరామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ వేతనాలు పెంపు, కరోనాతో చనిపోయిన వారి కి సాయం చేయాలని కోరామన్నారు. సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరామని... పరిష్కరించకపోతే ఉద్యమానికి వెళ్తామని స్పష్టం చేశామన్నా రు.