హుజురాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో కానుక !

Veldandi Saikiran
హుజూరాబాద్ ప్రజలకు మంత్రి హారిష్ రావు తీపి కబురు చెప్పారు.  హుజురాబాద్ నియోజక వర్గానికి 5 వేల డబుల్ బెడ్ రూం లు మంజూరు చేసి కట్టించే భాధ్యత తనదని  భవిష్యత్ లో  రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.  హుజురాబాద్ లో జరిగే ఎన్నికి న్యాయానికి అన్యాయనికి ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక అని.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది...?  బీజేపి ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో  ? అని ఆలో చించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలించింది టీఆర్ ఎస్ ప్రభుత్వం అని.. డిజీల్, పెంట్రోల్ ధరలు పెంచి ప్రజల పై భారం మోపింది బీజేపి ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. 

రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు పక్క ఊర్ల నుండి తరలించారని రాజేందర్ మాట్లాడుతున్నాడని... రాజేందర్ గుండెలు అదురుతున్నయని ఎద్దేవా చేశారు. మందు బిర్యాణీ కోసం వస్తున్నారని హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే మాట్లాడుతున్నారని ఈటల పై ఫైర్ అయ్యారు.  ఈటల రాజేంధర్ మాటల్లో న్యాయం ఉంటే గెలిపించాలని..  అన్యాయం ఉంటే చిత్తుగా ఓడించాలని కోరారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపిలో చేరారని.. బీజేపిలో ఉండి హుజురాబాద్ నియోజక వర్గ ప్రదలకు ఏం న్యాయం చేస్తావ్. ? అని నిలదీశారు.

 దమ్ముటే కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలు తీసుకురావాలని.. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆశీర్వదించాలని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలన్నారు. ఏడు ఏళ్ళు మంత్రిగా ఉన్న రాజేంధర్ ఒక్క డబుల్ బెడ్ రూం ఇడ్లు ఇచ్చారా. ? అని ప్రశ్నించారు.  అన్ని వర్గాల్లో ఉన్న పేదలను కాపాడుకోవడమే మన కేసిఆర్ ప్రధాన లక్ష్యమని.. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించి హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్దికి సహాకరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: