తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం !

Veldandi Saikiran
కేసీఆర్‌ సర్కార్‌ పై తెలంగాణ జన సమితి కోదండరామ్ పై నిప్పులు చెరిగారు.   సీఎం కేసీఆర్ ఒక్కడే ప్రగతి భవన్ లో ఉంటే ప్రతిపక్షాలు అన్ని ఇందిరా పార్క్ వద్ద ఉన్నాయని...  తెలంగాణ లో ఆరోగ్య సంక్షోభం నెలకొందని మండిపడ్డారు.  కోవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నా భిన్నం అయ్యాయని..  డిమాండ్ల సాధన మొదలు పెడితే కేసీఆర్ నల్ల చట్టాలు తెర మీదకు తెస్తున్నారని ఫైర్‌ అయ్యారు కోదండరాం.  సంపన్నులకు లాభం చేకూరేలా ధరణి చట్టం తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు.  

ధరణి లో అసలు అప్లికేషన్లు తీసుకొనే వాళ్ళు ఎవరో తెలియదని... పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కోదండరామ్‌.  భూమి సేకరణ పేరుతో విచ్చల విడిగా సేకరణ చేశారని... ఇప్పటి వరకు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం లేదన్నారు.  ఆదుకోవాల్సిన ప్రభుత్వం దోచుకుంటుదని... ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ లు ఏకమయ్యాయని... న్యాయమైన పోరాటం చేస్తామని తెలిపారు.  అన్ని స్థాయిల్లో అఖిలపక్షం పోరాటం చేస్తోందని వెల్లడించారు కోదండరాం.  

ప్రభుత్వం ఇసుక దందాలు,భూ దందాలు చేస్తోందని... ప్రభుత్వం వారి కోసం పని చేస్తోంది.. ప్రజల కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరాం.  మన ఓట్లు వేయించుకొని వారి ఆస్తుల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు.  మనం సాధించుకున్న ధర్నా చౌక్.. ఇవ్వాలా మన హక్కుల కోసం ఉపయోగ పడిందని నిప్పులు చెరిగారు కోదండ రాం.  కాగా.. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోని అఖిల పక్షం నేతలు ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ మరియు మోడీ సర్కార్‌ లకు వ్యతిరేకంగా దర్నా నిర్వహించారు. ఇక ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ మరియు ఇతర కమ్యూనిస్టు పార్టీలు కూడా పాల్గొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: