మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు, బండకేసి కొట్టాలి అంటూ...?

Gullapally Rajesh
ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టీ కొట్లాడినట్లు ఉంది అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇది ఆఖరి పోరాటం అని తెలంగాణ విముక్తి కోసం పోరాటం అన్నారు ఆయన. రాష్ట్రం లో పోడు భూముల కోసం కొట్లాట మొదలయ్యింది అని ఆయన గుర్తు చేసుకున్నారు. మహిళలు అని చూడకుండా డేకయిట్ కేసులు పెడుతున్నారని విమర్శించారు. హరిత హారం ముసుగు లో పోడు భూములు గుంజుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. భూములతో పాటు మా ప్రాణాలు కూడా తీసుకోండి అని గిరిజనులు చెప్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురు చేతుల్లో బంధి అయ్యింది అని ఆయన విమర్శించారు. తెలంగాణ విముక్తి కావాలంటే గులాబి చీడ వదిలించుకోవాలి అని కేసీఆర్ కి అండగా ఉన్న మోడీ నీ బండ కేసి కొట్టాలి అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు. గల్లీలో ఉన్న కేడి..ఢిల్లీలో ఉన్న మోడీ ఇద్దరు ఒకటే అన్నారు. పన్నుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నారు అని విమర్శలు చేసారు. కేంద్రం,రాష్ట్రం పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని ఆరోపించారు. 24 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్,డీజిల్ రూపంలో వసూలు చేశారు అన్నారు.
నల్లధనం బయటకు తెస్తానని మోడీ చెప్పారు అని ప్రతి పేద కుటుంబానికి 15 లక్షలు నరేంద్ర మోడీ భాకీ పడ్డారు అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ లేక ప్రజలు అల్లాడుతుంటే బర్త్డే రోజు గిఫ్ట్ వ్యాక్సిన్ ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందే అని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్ లు కడితే ..మోడీ రైళ్లు అమ్ముతున్నారు అని ఆయన ఆరోపించారు. డీ మానిటైజేశన్ ఒక విష ప్రయోగం అని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా రవాణా,సంస్థలు,అన్ని తెగ నమ్ముతున్నారు అని వ్యాఖ్యానించారు. 6 లక్షల కోట్లకు ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: