మా వాళ్ళను కొడితే బాగోదు: రేవంత్ రెడ్డి వార్నింగ్

Sahithya
తన ఇంటిపై దాడి చేసిన వారికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ తెలంగాణా ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. కేటీఆర్ పంపిన టిఆర్ఎస్ గుండాలు తన ఇంటిపై తన అనుచరులపై దాడి చేశారు అని ఆయన అన్నారు. తన ఇంటిపై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని విమర్శించారు.
కొంతమంది తమా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించకుండా అటు ఇటు తిప్పుతునట్టు సమాచారం ఉంది అని తమ కార్యకర్తలపై తర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. పోలీసుల కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరిగింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంతమంది బీహార్ కు చెందిన పోలీస్ అధికారులను ఉన్నత స్థాయిలో నియమించి తెలంగాణను బీహార్ రాష్ట్రం గా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారు అని అన్నారు.
ప్రభుత్వ అడుగులకు మడుగుల  ఒత్తే అధికారుల వివరాలను మా డైరీలో రాసుకుంటాం అని ఆయన కామెంట్ చేసారు. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకా అలాంటి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. తనకు అదనపు భద్రత కల్పించే విషయంలో  మరోసారి కోర్ట్ కెళ్తామని అన్నారు. గతంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ఒక్క సంతకంతో తమ పార్టీకి చెందిన వంద మందికి భద్రత కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించినపుడు తన భద్రత విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: