జనసేన తవ్వకం : జగన్ ఇలాకాలో వెయ్యికోట్ల మరో స్కాం ?
ఆ మంత్రి ఏం చేసినా వివాదమే!
ఏ మాట్లాడినా పెనుత్పాతమే!
అయ్యన్నకూ కోపమే
జనసేనకూ కోపమే
ఆయన సమర్థత పై నీలినీడలు
ఆయన చేశారు అని చెబుతున్న
అవినీతిపై విపక్షాల దగ్గర పూర్తి ఆధారాలు?
ఎందుకిలా? ఆన్సర్ ఇవ్వండి వెల్లంపల్లీ!
కృష్ణా జిల్లా జనసేన విభాగం ఇవాళ మంత్రి వెల్లంపల్లిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మంత్రి పదవి అడ్డు పెట్టుకుని కోట్లకు కోట్ల రూపా మయలు సంపాదిస్తున్నారని ఆరోపించింది. దీంతో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో సహా ఇతర ప్రాంతాల జనసైనికులు అలెర్ట్ అయ్యారు. మంత్రిపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. స్థల వివాదాల్లో పీఆర్ఓను తప్పించి, ఓఎస్డీని ఎలా ఉంచుకుంటారని ప్రశ్ని స్తోంది. వాస్తవానికి జగన్ ఇలాకాలో ఎప్పటి నుంచో వె ల్లంపల్లిపై అవినీతి ఆరోపణలు ఉన్నా ఇంత స్థాయిలో ఏ పార్టీ నాయకులూ ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. తొలిసారిగా కోట్ల రూపాయల భూమి కారుచౌకగా కొట్టేసిన ఘటనపై జనసేన స్పందించింది. గతంలోనూ దేవాదాయ శాఖ మంత్రిపై జనసేనాని కూడా ఫైర్ అయ్యారు. టీడీపీ లీడర్ అయ్యన్న సైతం ఇటీవలే అనరాని మాట లు అన్నారు.
ఇప్పుడు తెరపైకి వచ్చిన ల్యాండ్ మాఫియాలో ఎవరు దొంగలు ఏంటన్నది సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి.కానీ ముఖ్యమంత్రి అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో అన్నది ఓ డైలమా? మభూముల తగాదాలో వెయ్యి కోట్లు దోచుకున్న మంత్రిపై ఎందుకు చర్యలు లేవని కూడా ప్రశ్నిస్తోంది.
వైసీపీ ఇలాకాలో మరో వెయ్యికోట్ల స్కాం జరిగిందని జనసేన ఆరోపిస్తుంది. దేవదాయ శాఖలో జరిగిన ల్యాండ్ మాఫియా విలువ వెయ్యి కోట్లు దాటే ఉంటుందని చెబుతోంది. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ పై న్యాయ విచారణకూ పట్టుబడుతోంది. జక్కంపూడి (కృష్ణా జిల్లా)లో 5.50 ఎకరాల స్థలం ఒకటి పది కోట్లు పలుకుతుంటే దీనిని కోటికే కొట్టేయాలని, ఇది దేవాదాయ భూమి అని తెలిసి కూ డా మంత్రి ఓఎస్డీ ఇలాంటి పనులకు ఎలా పూనుకుంటా రంటూ జనసేన ఫైర్ అయింది. దేవాదాయ భూములకు ఎన్ఓసీ ఎలా ఇ స్తారని ప్రశ్నిస్తోంది. డబ్బులు చేతులు మారిన విషయమై ఏలూరు రోడ్డులోనే అంతా జరిగిందని, సీసీ టీవీ ఫుటేజీలు తవ్వితే నిజా నిజాలు వెల్లడవుతాయని చెబుతోంది.