టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏక పక్షంగా జరిగిన ఎన్నికలు స్థానిక ఎన్నికలు అని.. మేము ఆ ఎన్నికలను బై కాట్ చేసామని పేర్కొన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని.. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని.. వైసిపి పార్టీ వాళ్లకి నేరాలు-ఘోరాలు చేయడం అలవాటని ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు కూడా వైసిపి వాళ్ళు ఏమి చేయలేరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని.. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం రికార్డ్ అని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటే తెలంగాణలో కూడా దారుణంగా ఉన్నాయని.. ఎప్పుడు ఎబిసిడి వర్గీకరణ కోసం పని చేసుకుంటూ వచ్చానని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ లో ఒకసారి ఓటేసారు రెండో సారి ఓటు వేయకూడదు అనుకుంటున్నారని... జగన్ కు నేరాలు-ఘోరాలు చేయడం అలవాటెనని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఎప్పుడు నేరాలు చేయలేదు.. నేను రౌడీయిజం చేయాలను కుంటే సిఎం జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చేవాడు కాదని చురకలు అంటించారు..ఏపీ లో టీడీపీ ఎవరు ఏం చేయలేరని.. జగన్ పెట్టివ న్నీ తాత్కాలిక ఇబ్బందులేనన్నారు..ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని.. తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని మండిపడ్డారు చంద్రబాబు. తన లాంటి వాడు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రం లో లేదని ఆవేదన వీఆఖతం చేశారు చంద్రబాబు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న తన మీదనే తప్పుడు కేసులు బనాయించారని నిప్పులు చెరిగారు చంద్రబాబు.