శ్రీకాకుళం వార్త : కళా కథ కంచికే?
అటు ఎచ్చెర్లలోనూ, ఇటు రాజాంలోనూ పరువు పొగొట్టుకున్నారు. ఒక్కటంటే ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోలేకపో యారు. సొంత మండలం రేగిడిలోనూ ఆయన మనుషులు పరాజయం చవి చూశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న 20 ఎంపీటీసీల నూ వైసీపీ నెగ్గింది. ఇందులో 11 ఏకగ్రీవాలు కావడం విశేషం. వంగర మండలంలో అధికార పార్టీ సభ్యులు పది ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, మిగతా రెండూ కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. రాజాంలోనూ ఇలానే ఆయన దెబ్బపడ్డారు. ఇక్కడ 76 ఎంపీటీసీ స్థానాలకు 59 కైవసం చేసుకుంది వైసీపీ, అదేవిధంగా ఎచ్చెర్లలో 84 ఎంపీటీసీ స్థానాలకు 68 తన ఖాతాలో జమ చేసుకుంది వైసీపీ. ఎలా చూసుకున్నా వైసీపీ హవాలో కళా బృందాలు కొట్టుకు పోయాయి. రెండు నియోజకవర్గాల్లోనే కాదు విజయనగరంలోనూ ఆయన మనుషులు ఉన్నారు.
చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లోనూ ఒక్కటంటే ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. ఒకనాడు మంత్రి గా పనిచేసిన రోజుల్లో తిరుగులేని రాజసంతో ఉన్న నేత కాస్త ఇప్పుడు చతికిలపడ్డారు. సొంత సామాజికవర్గం (కాపు) నుంచి కూడా పెద్దగా ఆయనకు మద్దతు లేదని తేలిపోయింది.