ఏపీ మంత్రిని గట్టిగా టార్గెట్ చేసిన జనసేన...?

Sahithya
దేవాదాయ భూములను దేవాదాయ శాఖ మంత్రే దోచుకుంటున్నారు అని ఆరోపించారు జనసేన నేత పోతిన వెంకట మహేష్. తన అనుచరులతో ఒక టీం ను ఏర్పాటు చేసి దేవుడి భూములు కాజేస్తున్నారని ఆయన విమర్శలు చేసారు. తాడేపల్లి ప్యాలెస్ కి, సజ్జలకి వాటా కూడా ఉందా అని ప్రశ్నిస్తున్నాం అన్నారు. వెయ్యి కోట్లు దోచుకున్న మంత్రి వెల్లంపల్లి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఆయన పేర్కొన్నారు. వాటాలు పంచుకొని అతన్ని కాపాడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు.
డిజటలైజేషన్ ప్రకియ కాదు... దోచుకునే ప్రక్రియ కి శ్రీకారం చుట్టారు అని మండిపడ్డారు. 5.50ఎకరాల దేవాదాయ భూమి జక్కంపూడి లో పది కోట్లు ఉంది అని ఆయన పేర్కొన్నారు. కోటి రూపాయలకే ఈ స్థలం కొట్టేయాలని మంత్రి ఒ.యస్.డి అశోక్ మంత్రాంగం నడిపాడు అని ఆయన ఆరోపించారు. ఎనిమిది కోట్లు ఉన్న మరో బిల్డింగ్ ను కోటిన్నరకు కొట్టేయాలని ప్లాన్ వేశారు అని ఆయన విమర్శించారు. 18కోట్ల రూపాయలు ఆస్తులను మంత్రి కి తెలియకుండా కొట్టేయగలరా అని నిలదీశారు. దేవాదాయ శాఖ భూమికి యన్.ఒ.సి ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు.
ఆ శాఖ మంత్రిగా దేవుడి  భూములు, ఆస్తులు కాపాడటం మీ బాధ్యత కాదా అని నిలదీశారు. మీ కోటరీ లో ఉన్న బుజ్జి, కొనకళ్ల తో పాటు ఒ.యస్.డి అశోక్ కి వాటా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మీ ప్రమేయం లేకపోతే ఒ.యస్.డి పై కేసు ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు. మంత్రి దగ్గర ఉన్నవారు వేలల్లో దోచుకుంటే బయటకి పంపుతారు అన్నారు ఆయన. లక్షల్లో, కోట్లలో దోచుకుంటే ప్రమోషన్లు ఇస్తారు అని విమర్శించారు. దుర్గగుడి గత ఈఓ సురేష్ బాబు, సిబ్బంది విషయంలో ఇదే తేలింది అన్నారు. ఈ వివాదంలొ పిఆర్వోను తొలగించిన మంత్రి ఒ.యస్.డి ని మాతృ సంస్థ కి సరెండర్ చేస్తారా అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: