విదేశాల్లో బస్ లేట్ అయితే ఏం చేస్తారో తెలుసా...?

Sahithya
తెలంగాణా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేసారు. విపత్కర పరిస్థితుల్లో సజ్జనార్ తో పాటు నన్ను మా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారు నియమించారు అని అన్నారు. మమ్మల్ని నియమించిందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు చెప్తున్నామని అన్నారు. సీనియర్ అధికారుల సహకారం తీసుకొని ఒకప్పుడు ఆసియా లొనే నెంబర్ వన్ ఉన్న సంస్థ ప్రస్తుత నష్టాల పై ముందుకు వెళతాం అని ఆయన పేర్కొన్నారు. రోజుకు 13 కోట్ల ఆదాయం ఉన్న సంస్థ..ఖర్చు 18 కోట్లు అవుతుంది అని ఆయన వెల్లడించారు.
 13 కోట్లు ఉన్న ఆదాయం 10 కోట్లకు తగ్గింది అని ఆయన తెలిపారు. త్వరలోనే 14 కోట్లకు చేరుకుంటుంది అని ఆయన వివరించారు. కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఎండి గారు కష్టపడే వ్యక్తి ఆయన సహకారం ముఖ్యమంత్రి ఆశీర్వాదం తో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతాం అని తెలిపారు. బస్ స్టాండ్ కు వస్తే బస్సు వచ్చే వరకు టైం పాస్ చేస్తారు..ఇతర దేశాల్లో అని ఇక్కడ ఆటో ఎక్కి వెళ్తున్నారు..అది ప్రమాదకరం అని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసి బస్సు సురక్షితమైనది అని చెప్పుకొచ్చారు.
మేము మాటల్లో కాదు చేసి చూపిస్తాం అన్నారు. నాకు ఇది పెద్ద ఛాలెంజ్ అన్న ఆయన... కరోన వల్ల నష్టం తో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు డీజిల్ పెరుగుదల వల్ల తీవ్ర నష్టాలు ఉన్నాయి అని తెలిపారు. ప్రతి బస్సుకు ఆరుగురు ఎక్కువ ఉన్నారు అని తెలిపారు. కరోన సమయంలో ఆదాయం లేకున్నా ఇక్కడ జీతాలు ఇచ్చాము అని గుర్తు చేసుకున్నారు. ఆలస్యం అయినా కూడా చెల్లించారు అని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి జరగకూడదు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరి ఇక్కడ ఆర్టీసి ఆస్తుల జోలికి పోము అని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఆర్టీసీ ఆస్తులు అమ్మమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: