మరణం తరువాత విజయం : ఒక విజేత చావు తరువాత కూడా!
ఇప్పుడా కుటుంబంలో ఆనందం నెలకొంది. మనిషి లేకపోయినా ప్రజా మన్నన అన్నది ఆయన సాధించిన గొప్ప విజయం. చచ్చి బతకడం అన్ని సార్లూ సాధ్యం కాదు. గెలుపు శిఖరంగా మారడం అన్ని వేళలా కుదరదు కానీ ఆయన సాధించాడు. గెలిచాడు. ప్రజా పోరులో బ్యాలెట్ వార్ లో గెలిచి గోదావరి తీరాల్లో ఓ అరుదైన పేజీ తనకంటూ రాసే అర్హత ను సాధించాడు. ఆ వివరం ఈ కథనంలో..
జీవితాన్ని జయించండి.. సాధ్యమా! కాకపోవచ్చు. కాకలుతీరిన యోధులు ఎందరో! రాజకీయాలను జయించండి.. సాధ్యమా? ఓడి గెలిచిన నాయకులెందరో? ఇప్పుడు ఓ పెద్దాయన జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు కానీ ఎన్నికల రణ క్షేత్రంలో తిరుగులేని యోధుడిగా నిలిచాడు. తాళ్ళపూడి మండలం, వేగేశ్వరపురం - 2 ఎంపీటీసీగా కొమ్మిరెడ్డి రెడ్డి వెంకటేశ్వరావు గెలుపు సాధించారు.ఆయన ఇటీవలే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.