స్పీడ్ పెంచిన అచ్చెన్న, కౌంటింగ్ కామెంట్ ఏంటీ...?

Sahithya
ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు ఆరోపణలు చేసారు. అధికారులు, పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్నికాల రాశారు అని అన్నారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం అని వైసీపీ భావిస్తే...ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా ? అని ఆయన నిలదీశారు.
వైసీపీ నాయకులు ఏకగ్రీవాల మాటున సాగించిన అరాచకం వర్ణించలేనిది అని అచ్చెన్న విమర్శలు గుప్పించారు. వాటిని ఎన్నికలు అనరు అని అది సెలక్షన్ తప్పఎలక్షన్ కాదు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోంది అని విమర్శలు చేసారు ఆయన. పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసింది అని ఆయన పేర్కొన్నారు.
అడ్డదారుల్లో,అక్రమాల ద్వారా ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే కబళించే స్థాయిలో వైసీపీ నేతలు వ్యవహరించారు అని వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలయితే  మంత్రులు నేరుగా రాజభవన్ కి వెళ్ళాల్సిందేనని, రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని జగన్  హెచ్చరించడంతో మంత్రులు,శాసనసభ్యులు గ్రామాల మీద పడి దండయాత్ర చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమకేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు అన్నారు. ప్రజల్ని ఏం ఉద్దరించారని మీకు ఏకగ్రీవంగా పట్టం కడతారు?  అని నిలదీశారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72  శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది అన్నారు ఆయన. రాష్ట్రంలో  మొత్తం ఈ విధంగా అరాచకం, దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: