శ్రీకాకుళం వార్త : టీడీపీ యుద్ధం చేయలేదు ఎందుకని?
కానీ అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఈ రేసు నుంచి తప్పించారు. మరో సారి పాలవలస కుటుంబం తమ అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఈ కుటుంబం మొదట నుంచి జగన్ వెనుకే నడిచింది. పాలవలస రాజశేఖరం రాజశేఖర్ రెడ్డి హయాంలో జెడ్పీ చైర్మన్ చేయగా, ఈ సారి ఆ కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు బరిలో ఉన్నారని తెలుస్తోంది. పాలవలస రాజశేఖరం కుమారుడు విక్రాంత్ కు ఇప్ప టికే డీసీసీబీ పదవి కట్టబెట్టారు. దాని పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. దీంతో ఈ సారి తమకు అధిష్టానం కరుణ ఉంటుం దని అంటున్నారు పాలవలస కుటుంబ సభ్యులు.
స్థానిక పోరులో టీడీపీ సారి అస్త్ర సన్యాసం చేసింది. పోటీలో దిగకుండానే మౌనం అయిపోయింది. ఎలానూ ఇవి అధికార పార్టీకి అ నుకూలమే కనుక తాము పోటీ చేసినా పెద్దగా ప్రభావమేమీ ఉండదని భావించింది. కొన్ని చోట్ల నామమాత్ర పోటీకే పరిమితం అ యింది. అధిష్టానం కూడా పెద్దగా వీటిని సీరియస్ గా తీసుకోలేదు. దీంతో ఈ ఎన్నికలలో టీడీపీ ప్రభావం ఏమీ ఉండదని ముందు గానే తేలిపోయింది.