హుజురాబాద్ కే మరో నామినేషన్ పదవి..?
హుజురాబాద్ కు చెందిన బండా శ్రీనివాస్కు ఎస్సీ కార్పోరేషన్ పదవి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే వకులాభరణం కృష్ణమోహన్ కు బీసీ కమిషన్ చైర్మెన్ పదవి ఇచ్చారు. ఇలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవికి సిఫారస్ చేస్తూ గవర్నర్ కు లేఖ కూడా పంపారు సీఎం కేసీఆర్. అలాగే బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు స్వర్గం రవితో పాటు హుజురాబాద్ కు చెందిన మరో నేతకు నామినేటెడ్ పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది.
గతంలో హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మెన్గా బాధ్యతలు నిర్వహించిన వడ్లూరి విజయ్ కుమార్ కు నామినేటెడ్ పదవి వరించనుందని తెలుస్తోంది. గురువారం రోజు హుజురాబాద్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మనుమయ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్తాపనలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాటలు కూడా ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. వడ్లూరి విజయ్ కుమార్ హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్దికి చాలా కషి చేశారని ఈటల కుతంత్రాలకు విజయ్ కుమార్ ముందుగా బలయ్యారని చెప్పారు.