టీకా తీసుకుంటేనే జీతం, బోనస్.. ఎక్కడంటే ?
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళి సై సౌందరరాజన్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ టీకా ఆవశ్యకతను వివరిస్తూ, అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్న నినాదంతో పుదుచ్చేరిలో వైమానిక దళానికి చెందిన సైనికులు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు తమిళి సై సౌందరరాజన్.
అనంతరం తమిళి సై మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం, దీపావళి బోనస్, ఇతర రాయితీలు ఇస్తామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. రెండు డోసుల టీకా తీసుకున్నవారు కొవిడ్ భారిన పడ్డా వెంటనే కోలుకుంటున్నారని చెప్పారు. కుటుంబాన్ని, చుట్టూ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆమె.
మరోవైపు పుదుచ్చెరిలో గురువారం రోజు కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు కరోనాతో మరణించారు. ఇప్పటివరకు 963 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే పుదుచ్చెరిలో కరోనా భారిన పడి 1,827 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాంతాల వారిగా మరణాల సంఖ్యను చూస్తే టోల్ పుదుచ్చెరి - 1,437, కారైకల్ - 242, యానం - 106 మాహే - 42 కరోనా తో చనిపోయారు. అలాగే రికవరి రేటు ఎక్కవగా 97 శాతానికి పైగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా దాదాపు సగానికి పైగా ప్రజలకు కొవిడ్ మొదటి డోస్ పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.