మోడీ బర్త్ డే : రెండు తెలుగు రాష్ట్రాలకూ చిప్పే గతి!
ప్రయివేటు పద్ధతిలో డబ్బులు వస్తాయి
ఉద్యోగాలు పోతాయి అన్న సోయి లేదు మాకు
అందుకే మోడీ ఎప్పుడు వచ్చినా లేదా మోడీ దగ్గరకు
ఎప్పుడు మేం వెళ్లినా సన్మానాలు మాత్రం చేసే వస్తాం
అది మా నినాదం అదే మా పద్ధతి అధికారం మా నినాదం
అధికారం నిలుపుకోవడం మా పద్ధతి లేదా నైజం
రెండు తెలుగు రాష్ట్రాలకూ విభజన చట్టం అమలు చేయాలన్న రూల్ ఉంది. నియమం అయితే ఉంది కానీ ఆయన పాటిస్తారా పాటించరు కదా! రెండు తెలుగు రాష్ట్రాలకూ ఆస్తులున్నాయి. అవి ఉమ్మడివి. వీటి పంపకంపై కేంద్రం పెద్దన్న పాత్రలో జీవించాలి. కానీ నటిస్తోంది. కొన్ని సార్లు చూసీ చూడని విధంగా పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకూ జల వివాదాలు ఉన్నాయి. కేవలం బోర్డుల పరిధిని నిర్ణయించి చేతులు దులుపుకుంటోంది తప్ప బోర్డుల నిర్వహణకు సాయం చేయడం లేదు. ఇదే సమయంలో కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ నిర్వహించాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు జమ చేయాలి. ఆ పని వీరు చేయడం లేదు. చేయనప్పుడు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించడం లేదు. కేవలం వివాదాలు వస్తే చూసి, విని మీ గొడవ మీరు పడండి అని పోతోంది కేంద్రం.