కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

VUYYURU SUBHASH
కాపు సామాజిక వ‌ర్గం ఏపీలో ఏకంగా 27 శాతం వ‌ర‌కు ఉంది. ఇక కాపుల్లో ఉప కులాలుగా ఉన్న బ‌లిజ‌, తెల‌గ , ఒంట‌రి లాంటి కులాల‌ను కూడా క‌ల‌పితే వీరి సంఖ్య మ‌రింత ఎక్కువ ఉంటుంది. ఇక తూర్పు కాపు, మున్నూరు కాపులను కూడా క‌లిపితే రాజ‌కీయంగా వీరు తిరుగులేని శ‌క్తిగా ఉండాలి. ఇక ఉత్త‌రాంధ్ర‌లో వైజాగ్, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ సంఖ్య‌లో విస్త‌రించి ఉన్నారు తూర్పు కాపులు. అయితే వీరిని టీడీపీ కాని... ఇటు వైసీపీ కానీ రాజ‌కీయంగా త‌మ‌కు ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకే చూస్తున్నాయే త‌ప్పా వీరి అభివృద్ధికి కావాల్సిన విధంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.
ఏ పార్టీ అయినా ఈ జిల్లాల వ‌ర‌కు వీరికి ఒక మంత్రి ప‌ద‌వి ఇచ్చేసి స‌రిపెట్టేస్తున్నాయి. అయితే పెత్త‌నం మాత్రం ఇత‌ర కులాలే చేస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఒక్క తూర్పు కాపు మంత్రి లేరు. బొబ్బిలి రాజులు మంత్రిగా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రిగా అశోక్ ఉన్నారు. ఇక ఇప్పుడు వైసీపీ పాల‌న‌లో సీనియ‌ర్ నేత‌... స‌మైక్య రాష్ట్రంలోనే పీసీసీ అధ్యక్షుడిగా చేసిన బొత్స కు ఓ మంత్రి ప‌ద‌వి ఇచ్చి స‌రిపెట్టేశారు. దీంతో ఈ ఉత్త‌రాంధ్ర‌లో వెన‌క‌బ‌డిన వ‌ర్గానికి చెందిన తూర్పు కాపులు కుదిరితే ఒక్క మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్టుకోవ‌డం మిన‌హా అంత‌కు మించి రాజ‌కీయంగా ఎద‌గ‌డం లేదు.
తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకే చెందిన ఓ సీనియ‌ర్ మ‌హిళా కాపు నేతకు రాజ‌కీయంగా అన్యాయం జ‌రిగింది. టీడీపీలో ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేసిన ఆమె గజపతి నగరం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె పార్టీలో మాజీ మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ సామాజిక వ‌ర్గంలో ఓ మ‌హిళా నేత ఈ స్థాయికి ఎదిగారంటే గొప్ప విష‌య‌మే. అయితే ఆమెకు టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో పాటు చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేద‌న్న ఆవేద‌న‌తో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.
దీంతో ఏళ్ల‌కు ఏళ్లుగా పార్టీ కోసం త్యాగాలు చేసిన ఆమె ఈ వ‌య‌స్సులో మ‌రో ప్ర‌త్యామ్నాయం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. మ‌రి ఈ ప్రాంతంలో కాపులు అన్ని రంగాల్లో మ‌రింత ఐక్యంగా ఉంటే రాజ‌కీయ పార్టీల ఆట‌లు చెల్ల‌వు.
కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!
రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.
కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: