దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రుల కన్నా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బెటర్ అంటున్నాడు బీజేపీ సైద్ధాంతిక కర్త, ఆరెస్సెస్ ప్రచారక్గా పనిచేసిన ఉమేశ్ జీ.. ఇంతకు ఏపీ సీఎం ఎందులో బెటర్.. అంతలా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్కు నచ్చేంతలా జగన్ చేసిన పనేంటి... సొంత బీజేపీ సీఎంలను తక్కువ చేస్తూ ఓ విపక్షంకు చెందిన సీఎంను ఆకాశానికి ఎత్తడం చూస్తుంటే అంతలా ఆర్ ఎస్ ఎస్ను ఆకట్టుకున్న పనేంటిది. ఇప్పుడు ఈ ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ పనికి అటు బీజేపీలో, ఇటు ఆర్ ఎస్ ఎస్లో తీవ్ర కలకలం రేపుతుంది.
ఇంతకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని పొగుడుతున్న ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ ఉమేశ్ జీ ఏకంగా సీఎంను అచ్చమైన హిందువుగా, శంఖం ఊదుతున్నట్లుగా ఫోటోను మార్పింగ్ చేసి మరి ట్వీట్టర్లో ఫోటో పోస్టు చేయడం ఇప్పుడు బీజేపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.. ఇంతకు జగన్ను అంతలా పొగుడుతున్నది ఎందుకంటే... జగన్ సీఎం కాగానే కేవలం వందరోజుల వ్యవధిలోనే 60 ఏళ్లకు పైగా ఏ సీఎం చేయలేని పనిని జగన్ చేశాడట.. అది హిందూ దేవాలయాల్లో హిందూయేతర ఉద్యోగులను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడమేనట.
బీజేపీ సీఎంలు హిందూనినాదాలు చేయడమే కానీ హిందూ దేవాలయాల్లో హిందుయోతర ఉద్యోగులను తొలగించలేక పోయారు.. దేశంలో ఏ సీఏం ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు.. కానీ సీఎం జగన్ హిందు దేవాలయాల్లో హిందుయేతర ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసి సంతోషిస్తున్నా.. కాదు అభినందిస్తున్న అంటూ ట్వీట్ చేశాడు. జగన్ అందుకే బీజేపీ సీఎంల కన్నా బెటర్ అని బెస్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
అంతేకాదు హిందువ్యతిరేకిగా జగన్ను విమర్శించడం సరికాదని అతడే నిజమైన హిందువు అంటూ శంఖం ఊదుతున్న ఫోటోను ట్యాగ్ చేశాడు. ఇక జగన్ చేసిన పనికి మీడియా అనుకున్న ప్రచారం చేయలేదని, అదే బీజేపీ సీఎం చేస్తే పెద్ద ఎత్తున్న ప్రచారం చేసేవారని ఆయన కీలక వ్యాఖ్యాలు చేసి సంచలనం కలిగిస్తున్నాడు. ఇప్పుడు ఉమేశ్ జీ చేసిన ఈ కామెంట్లకు బీజేపీ శ్రేణుల గొంతులో వెలక్కాయ పడ్డట్లే...