గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ఇటీవల సంభవించిన భారీ తుపానుకు ఆ ప్రాంతం అతలాకుతలం అయింది. ఇలాగే కైనెటా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఏఎస్టీ 1 టీవీ రిపోర్టర్ లాజోస్ మాంటికోస్ ఆఫీసు నుంచి కీలక ఆదేశం వచ్చింది. తుఫాను బారిన పడి అక్కడ ప్రజాజీవనం ఎంత మేర అస్తవ్యస్తమైందో, తుఫాను తరువాత వారు ఏ విధంగా జీవిస్తున్నారో అన్న విషయాన్ని రిపోర్టింగ్ చేయాలనేది ఆ ఆర్డర్ సారాంశం. దీంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లాడు లాజోస్. అయితే, స్టూడియోలో న్యూస్ యాంకర్ అప్ డేట్స్ ఇవ్వాలని మాంటికోస్ను అడిగారు.