వైసీపీ ఎంపీ : చంద్రబాబు - లోకేష్ లు ఇద్దరూ "సైకో"లే !

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో సంవత్సరం మూడు నెలల వరకు మంచి హీటు మీద ఉంటాయి. ఎందుకంటే 2024 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలన్న కసితో నాయకులు అంతా ప్రజల వద్దకు వెళ్లి పాలన గురించి చెబుతున్నారు. పట్టాన స్థాయిలో ఎలా ఉన్నా కానీ.. గ్రామీణ స్థాయిలో మాత్రం వైసీపీకి తిరుగులేదు అని చెప్పాలి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకునే పనిలో పడ్డారు. కానీ ఈయన తాజాగా నిర్వహించిన రెండు సభలలో దుర్ఘటన జరిగి కందుకూరు మరియు గుంటూరు సభలలో మొత్తం 11 మంది మరణించడం నిజంగా బాధాకరం .
ఈ విషయం గురించి ఒకవైపు వైసీపీ నాయకులు మరియు ప్రజలు చంద్రబాబును విమర్శిస్తున్నారు. తాజాగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తండ్రి కొడుకులు చంద్రబాబు మరియు లోకేష్ లపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు బొత్తిగా బాధ్యత లేదని , తన స్వార్ధం కోసం ఎంతకైనా తెగిస్తాడని నందిగం సురేష్ విరుచుకుపడ్డారు. అంతే కాకుండాఆ చంద్రబాబు మరియు లోకేష్ లు సైకోలు అంటూ వ్యాఖ్యలు చేశాడు. సైకోలు ఇతరుల సంతోషం కన్నా కూడా తమ లాభాన్ని చూసుకుంటారని... వారికి తన మన అని బేధాలుండవని చెబుతూ ఆనాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్న విషయాన్ని ఉదాహరణగా చెప్పాడు.
రాజకీయాలలో ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు ఎన్నో మోసాలు చేశారని... అందుకే ఈరోజు చంద్రబాబు వలన అన్యాయంగా 11 మంది చనిపోయినా మళ్ళీ కుప్పంలో సభలకు అనుమతి ఇవ్వాలని అంటున్నారన్నారు. ఇప్పటి వరకు జరిగిన తతంగం అంత చూసికూడా పవన్ కళ్యాణ్ ఏమీ కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యకరం అంటూ నందిగం సురేష్ తన ఆగ్రహాన్ని తెలిపాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: