రూపాయి కూడా పలకని టమోటా..గగ్గోలు పెడుతున్న రైతన్నలు..

Satvika
ఒకప్పుడు వంద,రెండు వందల వరకూ పలికిన టమోటా ధర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పలకలేదని తెలుస్తుంది.కూరగాయల మార్కెట్ లో టమోటా ధర పూర్తి స్థాయిలో పతనం కావడంతో.. కనీసం తమకు ట్రాన్స్‌ పోర్టు చార్జీలు కూడా రావడం లేదంటూ టమాటాలు రోడ్లపైనే పారబోసి వెళ్తున్నారు. మొత్తానికి ఏపీలోని వినియోగ దారులకు టమాటాలు కొనాలంటే… మంట.. మరోవైపు రైతుల నోట్లో మట్టి అన్నట్టుగా మారింది. అవును ప్రస్తుత రోజుల్లో రూపాయి ఇస్తే.. చిన్న పిల్లలే కాదు.. బిచ్చగాడు కూడా తీసుకునే పరిస్థితి లేదు. అయితే కష్టనష్టాల కోర్చి.. ఆరుగాలం తాము పండించిన పంటకు కనీస ధర కూడా రాకపోవడం తో అన్నదాత నష్ట పోతున్నాడు.

టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం.. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీలోని టమాటా రైతులు.. నష్టపోతూనే ఉన్నారు. టమోటా రైతు అన్ని కష్టాలు దాటుకొని పంటను మార్కెట్‌కు తెస్తే.. ధర లేక తెల్లమొఖం వేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన సరుకుకు దారి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం వరకూ మంచి ధరతో 4 రాళ్లు వెనకేసుకున్న రైతులు.. గత కొన్ని రోజులుగా మార్కెట్ లో ధరలు లేకపోవడం తో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కర్నూల్ జిల్లాలో పరిస్థితి మరి దారుణంగా మారింది.కిలో టమాటా ధర ఒక రూపాయ నుంచి మూడు రూపాయలకు పలుకుతోంది. అయినప్పటికీ మార్కెట్ లో సరుకును కనీసం కొనేందుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి ఉంది.వ్యాపారులు పెడుతున్న ధరలను చూసి రైతుల కండుపు మండి పోతోంది. రవాణా ఖర్చులు కూడా చేతికి రాకపోవడంతో మార్కెట్ లో టమోటా లను రోడ్డు మీదనే పారబోసి వెళ్తున్నారు రైతులు. కనీస మద్దతు ధర కోసం దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: