వణుకు పుట్టిస్తున్న మరో వైరస్.. 88 శాతం మరణాల రేటు?

Purushottham Vinay
ఇప్పటికి కూడా కరోనా వైరస్ మహమ్మారి బాగా భయపెడుతూనే ఉండగా..తాజాగా కొత్తగా మరో వైరస్ కూడా జనాలని వణుకు పుట్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఎబోలా కుటుంబానికి చెందిన 'మల్బర్గ' వైరస్ కారణంగా ఇప్పటికే 'ఘనా'లోని ఇద్దరు వ్యక్తులు మరణించగా..ఇక వారి శాంపిల్స్ టెస్ట్ చేసింది ధృవీకరించింది WHO. ఇంకా అంతేకాదు వారికి ఎక్స్‌పోజ్ అయిన 98 మందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచడం జరిగింది.ఈ వైరస్ ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన హెమరేజిక్ ఫీవర్ వైరస్. ఇంకా అలాగే గబ్బిలాల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు ఇంకా అలాగే అవయవాలు లేదా ఇతర శారీరక ద్రవాల ద్వారా మరొకరికి వ్యాప్తిచెందుతుంది. ఇక ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించేది కాదని చెప్తున్న WHO.. మరణాల రేటు మొత్తం 88 శాతంగా ఉంటుందని తెలిపింది.


ఇక దీని లక్షణాల విషయానికి వస్తే..ఇక ఈ మల్బర్గ్ వైరస్ సోకిన వారిలో లక్షణాలు బయటపడేందుకు 2 నుంచి 21 రోజులు సమయం అనేది పడుతుంది. అయినప్పటికీ ఒక్కోసారి అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు ఇంకా అలాగే తిమ్మిరి వంటివి ఈ వ్యాధి లక్షణాలు కాగా కొన్ని సందర్భాల్లో వ్యాధి సోకిన ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల్లో మరణం అనేది కూడా సంభవించవచ్చు.ఇక ప్రస్తుతం ఈ వ్యాధికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇంకా వ్యాక్సిన్ లేదు. ఓరల్ లేదా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్‌తో హైడ్రేట్‌గా ఉంచడం ఇంకా సరైన ఆక్సిజన్ లెవల్స్ మెయింటెన్ చేయడం ద్వారా రోగి జీవించే అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. అందువల్ల ప్రజలు ఖచ్చితంగా ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కుటుంబసభ్యులతో సహా డాక్టర్స్ కూడా వైరస్ సోకిన వ్యక్తులతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని హెచ్చరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: