మరోసారి గొప్ప మనసు చాటుకున్న జగన్!

Purushottham Vinay
ఇక ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తిరుపతిలో సీఎం జగన్ కాన్వాయ్ ఆపి మరి వినతి పత్రం తీసుకున్నారు. రేణిగుంటలో జగన్ మోహన్ రెడ్డి సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు.ఆ భద్రతా సిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం కూడా స్వీకరించారు. 2019 వ సంవత్సరంలో శ్రీకాళహస్తికి చెందిన మహేశ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ వైద్యం కోసం మహేశ్ రూ.7 లక్షలు వెచ్చించారు. మెడికల్ బిల్లు రీయింబర్స్ మెంట్ కోసం మూడేళ్లుగా వారు ఎదురుచూపులు చూస్తున్నారు.ఇక గతంలో రేణిగుంట విమానశ్రయం దగ్గర వినతి పత్రం ఇచ్చేందుకు ఓ మహిళ.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అడ్డుగా వచ్చింది. అయితే ఆ మహిళను చూసి సీఎం జగన్ కాన్వాయ్ ను ఆపించారు. ఇక ఆమె సమస్య తెలుసుకోవాలని ఓఎస్ డీని ఆదేశించారు. ఇంకా అలాగే ఏప్రిల్ 5 వ తేదీన సీఎం జగన్.. అంబులెన్స్ కు దారి ఇచ్చి తన గొప్పమనసును చాటుకున్నారు. ఇక సీఎం కాన్యాయ్ మధ్యలో నుంచి 108 అంబులెన్స్ వాహనాన్ని పంపారు.


ఇక కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పోలీసులు పంపించివేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్నారు.ఇక అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ వైపు వెళ్లేందుకు 108 వాహనం అనేది వచ్చింది.అప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ కోసం పోలీసులు వాహనాలు ఆపారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు. ఇక 108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ అనేది పాసింగ్ అయింది. సీఎం కాన్వాయ్ ని ఇక మధ్యలో ఆపి పోలీసులు 108 వాహనాన్ని పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: