అమరావతి : పవన్ పేరు ఫిక్సయిపోయిందా ?

Vijaya



జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దత్తపుత్రుడనే పేరు ఫిక్సయిపోయినట్లుంది. మూడు ప్రధాన పార్టీల అధినేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్న విషయం తెలిసిందే. నిజానికి జనసేన ప్రధానపార్టీ ఏమీకాదు. అయినా పవన్ కు  సినీసెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి జనసేన కూడా ప్రధానపార్టీ అయిపోయిందంతే. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, పవన్ రెగ్యులర్ గా జగన్ను టార్గెట్ చేస్తున్నారు. అందుకనే జగన్ కూడా పై ఇద్దరినీ టార్గెట్ చేస్తున్నారు.



పై ఇద్దరిలో కూడా జగన్ ఎక్కువగా పవన్నే టీజ్ చేస్తున్నారు. రెండుచోట్ల పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయిన దత్తపుత్రుడంటూ పదే పదే కాయిన్ చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగసభలో మాట్లాడిన జగన్ పదే పదే పవన్ను దత్తపుత్రుడని సంబోంధించటం గమనార్హం. జగనే కాదు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా పవన్ను దత్తపుత్రుడనే అంటున్నారు.



అంటే జనసేన అధినేతపైన జగన్ అండ్ కో దత్తపుత్రుడనే పేరును ఖాయం చేసేయాలనే ప్లాన్లో ఉన్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే కాలేజీలో ర్యాగింగ్ లేదా టీజింగ్ చేసినట్లు పదే పదే పవన్ను దత్తపుత్రుడని అనాల్సిన అవసరంలేదు. జగన్ ఉద్దేశ్యంలో రాష్ట్రంలోని జనాలంతా పవన్ను ఇకనుండి దత్తపుత్రుడనే గుర్తుపెట్టుకోవాలని ఉంది కాబోలు. వీళ్ళ టీజింగ్ కు పవన్ గట్టిగా రియాక్టు కాకుండా తనను దత్తపుత్రుడని అనద్దని, అంటే తాను కూడా జగన్ను సీబీఐ దత్తపుత్రుడని అనాల్సుంటుందని ఉడుక్కుంటున్నారంతే.




ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే తనను దత్తపుత్రుడని అనటాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నారు. మరి సినిమా ఫంక్షన్లలో జగన్ను లేదా కొందరు మంత్రులను పవన్ నోటికొచ్చినట్లు ఎందుకు మాట్లాడినట్లు ?  తానుమాత్రం ఇతరులపై రాళ్ళు వేయచ్చు కానీ ఇతరులెవరు తనను ఏమీ అనకూడదని పవన్ అనుకుంటే కుదరదు. ఆ ఆలోచనంతా సినిమా సన్నివేశాల్లో సరిపోతాయేమో కానీ నిజజీవితంలో కుదరదు. అందుకనే ఇతరులను అనేటపుడు తనను కూడా వాళ్ళు అలాగే అంటారని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: