చంద్రబాబు టూర్‌పై రోజా షాకింగ్ కామెంట్స్?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను బాదేస్తోందని చెబుతూ.. ఆయన బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేపట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర లో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు  నవ్వుకుంటున్నారని వైసీపీ మంత్రి రోజా అంటున్నారు. అధికారం లేదు ఇంక రాదు అని అక్కసుతో చంద్రబాబుు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు నాయుడు కు 2024లో బాదుడే బాదుడని ఎద్దేవా చేస్తున్నారు.

చంద్రబాబు ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక పొత్తులపై ఆరాటపడుతున్నారని రోజా విమర్శించారు. ప్రజలు గతంలో అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని రాబందుల్లా తిన్నారని.. రోజా మండిపడ్డారు. అన్న క్యాంటిన్లు నుంచి అమరావతి వరకు.. చిన్న పిల్లల కోడి గుడ్లు దగ్గర్నుంచి ఫైవ్ స్టార్ వంటల వరకు చంద్రబాబు దోచుకున్నారని  మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను సైతం మోసం చేసారని.. జగన్ పై యుద్ధం చేసే దమ్ము లేకనే చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని మంత్రి రోజా అన్నారు.

ఇక  తనపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలకు మంత్రి రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు అక్క అమ్మ, చెల్లి ఎవరూ లేరా అని మంత్రి రోజా ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడితే బాధగా ఉండదా అని  మంత్రి రోజా  ఆవేదన వ్యక్తం చేశారు.  తన భర్త సెల్వమణి ఏ రాష్ట్రంలో షూటింగ్‌ ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంది అని మాత్రమే చెప్పారని  మంత్రి రోజా  గుర్తు చేశారు.

టిడిపి నాయకులు మాత్రం దానిని వక్రీకరిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మహిళలు ఇలా కించపరచడం తప్ప టీడీపీ నేతలకు పాయింట్‌ పై సూటిగా మాట్లాడటం చేత కాదా అని మంత్రి రోజా ఘాటుగా కామెంట్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కారం ఉన్న నేతలకు గురించి ఇంకా ఏం మాట్లాడతామని మంత్రి రోజా కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: