కేసీఆర్ పులి.. వాడు వీడంటే చీరేస్తాం అంటున్న మంత్రి!

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ కోపంతో నిప్పులు చెరగడం జరిగింది.ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పులి లాంటోడని శ్రీనివాస్ గౌడ్ చాలా కోపంతో ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను ఎవ్వరూ ఓడించలేరని ఆయన బాగా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిన కేసీఆర్‌ని, మంత్రులను వాడు, వీడు అంటే అసలు ఊరుకోమని అలా అంటే నాలుక చీరేస్తాం అని బండి సంజయ్‌ను మంత్రి హెచ్చరించడం జరిగింది.మతం ఇంకా అలాగే కులం పేరిట రాజకీయాలు  చేయడం అనేది అసలు ఎంత మాత్రం కూడా సరికాదని చెప్పారు. 2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆయన కోపంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పుట్టుక నుంచే బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతం పై వివక్షని ప్రదర్శిస్తోందని ఆయన చెప్పారు.


అలాగే రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు ఇంకా అలాగే సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టిందని మంత్రి గుర్తు చేయడం జరిగింది.సిగ్గు, శరం ఇంకా అలాగే లజ్జ అనేది అసలు లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరులో మాట్లాడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.ఇక సంజయ్ ఓ లుచ్చా లాగా, వీధిరౌడీలా మాట్లాడుతున్నాడని ఆయన నిప్పులు చెరిగారు.అలాగే ఆయనకు అసలు ఈ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన వాడేవడో అని విమర్శించారు. సీఎం ఇంకా అలాగే మంత్రులను పట్టుకుని వాడు వీడు అంటావారా సంజయ్.. ఎవడివిరా నీవు, నీకెవడ్రా సంస్కారం నేర్పింది అని కోపంతో ఊగిపోయి దుమ్ముదులిపారు.ఈ విధంగా శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: