"ఏపీ సీఎం పవన్ కళ్యాణ్".... హైపర్ ఆది కోరిక తీరుతుందా?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో కాబోయే సిఎం ఎవరా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక రాజకీయ రంగంలో అయితే దీనిపై ఒక యుద్దమే నడుస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం దేవుడెరుగు. కానీ అధికార పార్టీ వైసిపిని మాత్రం గద్దె నుండి దింపాలని మరోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకోవాలని ప్రత్యర్ధి పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు కలిసి మూకుమ్మడిగా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఇక మెయిన్ ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ఈసారి కూడా తన పయనం బిజెపి తోనే అంటుందా... లేదా గ్లాసు గుర్తు జనసేన పార్టీతో చేతులు కలుపుతారా అన్న అంశం పై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ వైపు నుండి ప్రచారం చేయడానికి వచ్చాడు జబర్దస్త్ హైపర్ ఆది.
కలిసి రండి.. కదలి రండి...అందరినీ ప్రేరేపించి మన అన్న పవనన్నను గెలిపించండి అంటూ ప్రచారం మంచి హుషారుగా చేశారు. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక సభకు హాజరైన హైపర్ ఆది విద్యార్థులతో మాట్లాడుతూ జనసేన పార్టీని గెలిపించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసి పార్టీని అధికార పీఠాన్ని అధిష్టించేలా చేయాలి అంటూ అవగాహనను పెంచాడు ఆది. పవన్ అభిమానిగా మీరు ఓటు వేయడం కాదు ఇతర పార్టీల వారిని కూడా జనసేనకు ఓటు వేసేలా ప్రేరేపించాలి అన్నారు. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అన్న గ్రూపులుగా మార్చి అందరినీ ఇన్వాల్వ్ అయ్యేలా చూడండి జనసేన పోస్ట్ లను షేర్ చేయండి. అన్న పవన్ ను ఏ విధంగా సిఎం చేయాలి అన్న దానిపై ప్రత్యేక దృష్టి పెట్టండి,వాటిని ఆచరణలో పెట్టండి అంటూ చైతన్య పరిచాడు.
పవన్ అభిమానులు మాత్రమే కాదు మిగిలిన వారిని కూడా అన్న విలువను తెలుసుకుని అన్న పార్టీ అధికారం లోకి వస్తే అందరి విలువ పెరుగుతుంది అని ప్రజలందరూ అభివృద్ధి పదంలో సంతోషంగా జీవిస్తారు అని తన ప్లానింగ్ మొత్తాన్ని చెప్పకనే చెప్పాడు ఆది. పవన్ ను గెలిపిస్తే దేశానికి లాభమే తప్ప నష్టం లేదని, ఎందుకంటే పవన్ కు దోచుకునే ఉద్దేశం అసలు లేదు , దాచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: