కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. ఆ పని చేస్తారా?

Chakravarthi Kalyan

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. వడ్ల కొనుగోళ్ల కేంద్రాలను, కాంటాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసారు. బిజెపి తెలంగాణ శాఖ చేసిన అనేక ఉద్యమాలకు తలవొగ్గే మీరు వడ్లు కొనడానికి ముందుకు వచ్చారన్న బండి సంజయ్..  అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతీ వడ్ల గింజ కొంటామని ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశం అనంతరం మీరు ఆర్భాటంగా ప్రకటించి 15 రోజులు కావస్తోందని గుర్తు చేశారు.  క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే మీ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని స్పష్టం అవుతోందన్న బండి సంజయ్..  ఇప్పటికైనా మీరు కళ్లకు కట్టుకున్న గంతలు   తీసేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేయాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న నాకు అనేక మంది రైతులు వచ్చి కొనుగోళ్ళ కేంద్రాలు ప్రారంభించలేదని, దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకొని వచ్చారని బండి సంజయ్ అన్నారు. . ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల్‌ లో 71 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం రెండు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని బండి సంజయ్  గుర్తు చేశారు. వనపర్తిలో 225 కేంద్రాలకు  19 కేంద్రాలు, నారాయణపేట్‌లో 91 కేంద్రాలకు 70 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంటా పెడుతున్నది మాత్రం నామామాత్రమేనని బండి సంజయ్  తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారన్న బండి సంజయ్..  రాష్ట్రప్రభుత్వం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి వుండగా కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నదన్నారు. దీన్ని బట్టే రాష్ట్రప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతున్నదని మండి పడిన బండి సంజయ్..  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించటమే కాకుండా ప్రతీ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కాంటా ఏర్పాటుచేసి ప్రతీ ఒక్క గింజ కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్రశాఖ తరుపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: