ఎల్లో మీడియా పై సీఎం జగన్ సంచలన కామెంట్స్ ?
ఈ భేటీలో సిఎం జగన్ కు ప్రధాని బాగా తలంటు పోశారని.. అక్షింతలు వేశారని... వారు కామెంట్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు. కానీ ప్రత్యర్ధి పార్టీ నేతలు ఈ సమావేశంలో మోదీ గారు జగన్ గారికి బాగా హితోపదేశం చేశారని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా ఏపి సిఎం గారే ప్రస్తావించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పనుల మీద నేను ప్రధానిని కలిస్తే, ఆయన నాకు క్లాస్ పీకారని ప్రచారం చేశారు..!! చేస్తున్నారు..!! నిజానికి ఆ భేటీ సమయంలో నేను, మోడీ గారి మాత్రమే రూం లో ఉన్నాం... మరి వీరు ఎక్కడి నుండి విన్నారు, చూశారు...?? అంటే వాళ్ళు ఏమైన మా సోఫాల కింద ఏమైనా దాక్కుని విన్నారా ఏమిటి అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించారు.
అది నాపై ఉన్న అసూయతో చేస్తున్న దుష్ప్రచారమే తప్ప మరి ఇంకేమీ లేదు. అసూయకు ఈ లోకంలో ఔషదమే లేదు..!! మనసు ఇంత అసూయతో నిండిపోతే త్వరగా బిపి లు గుండెపోటు లాంటివి వచ్చేస్తాయి. ఇలాగే కొనసాగితే త్వరగా టికెట్టు కూడా తీసుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇలాంటి వారి మాటలు పట్టించుకో