ఎల్లో మీడియా పై సీఎం జగన్ సంచలన కామెంట్స్ ?

VAMSI
ప్రత్యర్ధి పార్టీల అధినేతలు చేస్తున్న కామెంట్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి. అది అలా ఇలా కాదండోయ్ ఓ రేంజ్ లో వాయించేసారు అంటే నమ్మండి. అరిటాకు పెట్టి మరి ఇంకోసారి నోరు తెరిచి ఏది మాట్లాడకుండా కావాల్సిన దానికన్నా ఎక్కువ గానే వడ్డించేశారుగా అంటున్నారు ఈ వార్త విన్న వారు, ఇంతకీ ఆయన అంతగా ఏమన్నారు అంటే ? ఇటీవలే సిఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఏపి సిఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాల గురించి చర్చ జరిగిందని సమాచారం. అయితే పూర్తి వివరాలు ఇంకా వెళ్లడవ్వలేదు. కానీ ప్రత్యర్ధి పార్టీలు మాత్రం జరిగింది జరిగినట్టు చెబుతాం...జరగంది కూడా ఊహించి చెబుతాం..   అంటూ ఊహించుకుని మరి తోచింది చెప్పేస్తున్నారు.
ఈ భేటీలో సిఎం జగన్ కు ప్రధాని బాగా తలంటు పోశారని.. అక్షింతలు వేశారని... వారు కామెంట్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు. కానీ ప్రత్యర్ధి పార్టీ నేతలు ఈ సమావేశంలో మోదీ గారు జగన్ గారికి బాగా హితోపదేశం చేశారని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా ఏపి సిఎం గారే ప్రస్తావించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పనుల మీద నేను ప్రధానిని కలిస్తే, ఆయన నాకు క్లాస్ పీకారని ప్రచారం చేశారు..!! చేస్తున్నారు..!! నిజానికి ఆ భేటీ సమయంలో నేను, మోడీ గారి మాత్రమే రూం లో ఉన్నాం... మరి వీరు ఎక్కడి నుండి విన్నారు, చూశారు...?? అంటే వాళ్ళు ఏమైన మా సోఫాల కింద ఏమైనా దాక్కుని విన్నారా ఏమిటి అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించారు.
అది నాపై ఉన్న అసూయతో చేస్తున్న దుష్ప్రచారమే తప్ప మరి ఇంకేమీ లేదు. అసూయకు ఈ లోకంలో ఔషదమే లేదు..!! మనసు ఇంత అసూయతో నిండిపోతే త్వరగా బిపి లు గుండెపోటు లాంటివి వచ్చేస్తాయి. ఇలాగే కొనసాగితే త్వరగా టికెట్టు కూడా తీసుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇలాంటి వారి మాటలు పట్టించుకోYour browser does not support HTML5 video.వాల్సిన పనిలేదని... ప్రజలు ఇలాంటి వారి మాటలను అస్సలు నమ్మరని సిఎం జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: