ఇండియా, చైనా కలిసి కొత్త గేమ్.. ఏంటంటే?
అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు ఒక ఉక్రెయిన్ కు మద్దతు గా ఉన్నాయ్. ప్రపంచ దేశాలు ఇక ఉక్రెయిన్ కు మద్దతుగా నిలవాలని రష్యా వైఖరిని ఖండించాలి అంటూ కోరుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే చైనా సహా మరికొన్ని దేశాలు రష్యాకు మద్దతుగా ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. కానీ అటు భారత్ మాత్రం మొదటినుంచి తటస్థ వైఖరిని వ్యవహరిస్తూ వస్తుంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఇక భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరిపారు..
ఈ చర్చల్లో భారత్ చైనా సరిహదులతో నెలకొన్న పరిస్థితులతో పాటు.. ఉక్రెయిన్ రష్యా మధ్య తలెత్తిన యుద్ధం గురించి కూడా చర్చించారు. ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలి అంటూ ఇక చైనా భారత దేశాలు స్టేట్మెంట్ ఇచ్చాయ్. ఇందులోనే చిన్న మెలిక ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఉక్రెయిన్లో ఇరుదేశాలు యుద్ధం చేస్తున్నాయని.. ఇక ఇరు దేశాల యుద్ధాన్ని ఆపేసి శాంతియుతంగా చర్చలు జరుపితేనే పరిస్థితులు అదుపులోకి వస్తాయి అన్న కోణంలో స్టేట్మెంట్ ఇచ్చాయి చైనా భారత్ లు. ఇక ఈ రెండు దేశాలు ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.