తెలంగాణాలో జర్నలిస్టులకు పురష్కారాలు అందజేసిన ప్రభుత్వం..
రాష్ట్రంలో ని ప్రతీ ఒక్క రంగంలో ని వారు తమసేవలకు గుర్తింపు కోరుకుంటారని, ఈ క్రమంలోనే వీరి సేవలకు గుర్తింపుగా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం తరపున చిరు సత్కారం చేస్తున్నామని చెప్పారు.. తెలంగాణా ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల తో అబివృద్ది, సంక్షేమ రంగంలో వచ్చిన మార్పులను ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తలను ప్రజలకు తెలియజెయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రం లో 18000 పోలీసు ఉద్యోగాల నియామకం జరిగితే దానిలో 30 శాతం మంది మహిళలే ఉండటం విశేషం.. విధ్యుత్ శాఖలో 9644 ఉద్యోగ నియామకాలు జరిగితే
అందులోనూ 50 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు..
టీవీ5 న్యూస్ ప్రజెంటర్ రోజా ను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుతో సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు తెలంగాణాలో మహిళలు ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు..