కొడాలి ‘ఫిక్స్’ చేయించుకుంటున్నారా?

M N Amaleswara rao
ప్రస్తుతం రాజకీయాల్లో ఏ నాయకుడైన పనులు చేస్తే పదవులు రావడం లేదు..పొగిడితేనే పదవులు వస్తున్నాయి. పదవి కావాలంటే నాయకులు చేసిన పని ఒకటే...తమ అధినేతలకు భజన చేయడం...ప్రత్యర్ధులని బూతులు తిట్టడం...అలా చేస్తే చాలు ఆటోమేటిక్‌గా పదవులు రావడం, లేదా పదవులు కంటిన్యూ అవ్వడం జరుగుతాయి. ఇప్పుడు ప్రతి నాయకుడు అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అంటే ప్రజలకు బాగా సేవ చేస్తే పదవులు వస్తాయనే కాన్సెప్ట్ ఎప్పుడో పోయిందని చెప్పాలి. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆ కాన్సెప్ట్ ముగిసిపోయిందని చెప్పొచ్చు. అప్పుడు పదవులు కావాలంటే టీడీపీ నేతలు ఏ విధంగా చంద్రబాబుకు భజన చేసేవారో అందరికీ తెలిసిందే. ఇంకా నాయకులు వేరే పని ఏమి పెట్టుకునే వారు కాదు..అలాగే ప్రత్యర్ధులపై విమర్శలు చేసేవారు..అలా చేస్తే చాలు పదవి గ్యారెంటీ అన్నట్లు ఉండేది.
ఇక అదే పరిస్తితి జగన్ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతుంది...ఇక నోరు ఉన్నవారికే పదవి అనే పరిస్తితి..అందుకే వైసీపీలో అందరూ నోటికి పనికి చెబుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారు ఏ స్థాయిలో చంద్రబాబుని తిడుతూ..జగన్‌కు భజన చేస్తున్నారో అందరికీ తెలిసిందే...అంటే వారి పదవులని ఐదేళ్ల పాటు కంటిన్యూ చేయించుకునేందుకు ఇలా భజన చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కొట్టేయడానికి అదే దారిలో వెళుతున్నారు. తమ నాయకుడుని పొగడటం, చంద్రబాబుని తిట్టడం ఇదే పని. విచిత్రం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు..నెక్స్ట్ అధికారంలోకి వస్తే పదవులు వస్తాయనే ఆశ వాళ్ళది.
అయితే ఇలా తమ అధినేతకు భజన చేస్తూ, చంద్రబాబుని విపరీతంగా తిడుతున్న కొడాలినానికి మంత్రి పదవి ఐదేళ్ల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసలు తమ అధినేత జగన్ దేశంలోనే పోలిటికల్ మెగాస్టార్ అంటూ నాని ఓ రేంజ్‌లో భజన చేసేస్తున్నారు. మరి ఇలా తమ అధినేతపై ప్రేమ కురిపిస్తున్న కొడాలి ఐదేళ్ల పాటు క్యాబినెట్‌లో కొనసాగుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: