చంద్రబాబు మళ్ళీ సీఎం కాలేరు : కొడాలి నాని

Purushottham Vinay
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎక్స్పోర్ట్ అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడటం జరిగింది.చంద్రబాబు నాయుడును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని కోపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును సీఎం చేసే వరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు ఇంకా తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.ఎన్ని చేసినా కాని ఆయన సీఎం కాలేరని కొడాలి నాని అన్నారు.జగన్ మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించడం చంద్రబాబు వల్ల కాదని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ గారి చావుకు కారణమై సీఎం పదవి తెచ్చుకుని.. దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు కుబేరుడు అయ్యాడని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.

అలాగే వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ విషయంలో ఎవరికి నచ్చిన అంశం వాళ్లు బయటకు తెస్తున్నారని.. ఆరోజు జగన్ మోహన్ రెడ్డి కేసులో అప్పుడున్న జేడీ కూడా తమకు కావాల్సిన పత్రికలకు లీకులు ఇచ్చేవాడని ఆయన ఆరోపించారు. వివేకాను హత్య చేయిస్తే జగన్‌ మోహన్ రెడ్డికి ఏం వస్తుందని కొడాలి నాని ప్రశ్నించారు. వాళ్లు దేవుడిని నమ్ముకున్న మంచి కుటుంబం అని.. అలాంటి వారి కుటుంబాన్ని రోడ్డుమీదకు లాక్కొచ్చిన వాళ్లు టీడీపీ వాళ్లు అని ఆయన చాలా తీవ్రంగా మండిపడ్డారు. పదవులు అనేవి అసలు శాశ్వతం కాదు అని.. చరిత్ర అనేది శాశ్వతం అని చంద్రబాబు నాయుడు గుర్తించాలన్నారు. ఎన్టీఆర్ ఇంకా అలాగే వైఎస్ఆర్ తరహాలో జగన్ మోహన్ రెడ్డి కూడా చరిత్రలో నిలిచే పనులు చేస్తున్నారని కొనియాడారు. కొడుకును ఎమ్మెల్యేగా ఇంకా కుప్పంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేని వ్యక్తి సొల్లు పురాణం చెప్తున్నాడని చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: