యూపీ ఎన్నికల్లో రైతుల మద్దతు ఎవరికో తెలుసా...!
నాటి నుంచి రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పంజాబ్ ఎన్నికల్లో రైతు సంఘాలు ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే యూపీలో మాత్రం రైతులు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాలు సమాజ్ వాదీ పార్టీకి, రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిపై రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తీవ్రంగా స్పందించారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని క్లారిటీ ఇచ్చారు రాకేష్ తికాయత్. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి తాము మద్దతివ్వడం లేదన్నారు తికాయత్. అయితే విపక్ష కూటమికి మద్దతు విషయంలో గందరగోళం నెలకొందని ఆయన తెలిపారు. అటు భారతీయ కిసాన్ యూనియన్ నేత నరేష్ తికాయత్ మాత్రం... తాము ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీకేయూతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు రాకేష్ తికాయత్. తాము కేవలం రైతుల శ్రేయస్సు గురించి మాత్రమే చర్చించుకుంటామని... రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు రాకేష్ తికాయత్.