బాబు హ‌యాంలో అలా.. మ‌న హ‌యాంలో ఇలా.. వైసీపీ నేత‌ల బెంబేలు...!

VUYYURU SUBHASH
ఔను! ఇప్పుడు ఇదే వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌మైన చ‌ర్చ‌గా సాగుతోంది. చంద్ర‌బాబు హ‌యాంలోను.. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలోనూ.. ఒకే త‌ర‌హా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అదే.. మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గానికి ఇళ్లు ఇచ్చే విష‌యం. గ‌తంలో చంద్ర‌బాబు అమ‌రావ‌తి స‌మీపంలో హ్యాపీనెస్ట్ ప్రాజ‌క్టును ప్ర‌తిపాదించారు. 1200 అపార్ట్‌మెంట్‌ల‌ను ఆయ‌న అప్ప‌ట్లో ఆన్‌లైన్‌లో పెట్టారు. వీటిని దేశ విదేశాల్లోనివారు.. హాట్ కేకుల్లా కొనుగోలు చేశారు. నిజానికి వీటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా .. కొనేశారు. దీనిపై అంద‌రికీ అప్ప‌ట్లో ఆశ్చ‌ర్యం వేసింది.

ఎందుకంటే.. హ్యాపీనెస్ట్‌ను ప్రారంభించిన వెంట‌నే ఆన్‌లైన్‌లో విక్ర‌యాలు జోరందుకుని కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే ఇవి అమ్ముడ‌య్యాయి. అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఇలాంటి ప్రాజెక్టునే చేప‌ట్టారు. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌కు శ్రీకారం చుట్టారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు 150, 200, 240 చ‌ద‌ర‌పు అడుగులను విక్ర‌యానికి పెట్టారు. దీనికి సంబంధించిన సైట్‌ను సీఎం జ‌గ‌న్ ఇటీవ‌లే ప్రారంభించారు.

భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు. అయితే.. దీనికి స్పంద‌న మాత్రం అంతంత‌మాత్రంగా వ‌చ్చింది. మొత్తం 3,894 ప్లాట్ల‌ను విక్ర‌యానికి పెట్ట‌గా 24 గంట‌ల్లో కేవ‌లం 117 మాత్ర‌మే అమ్మ‌కం జ‌రిగాయి. వాస్త‌వానికి దీనిని వాయిదాల ప‌ద్ద‌తిలో ప్ర‌వేశ పెట్టారు.  మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గం.. కొద్ది మొత్తంలో బుక్ చేసుకుని.. త‌ర్వాత‌. విడ‌త‌ల వారీగా నిధులు చెల్లించే వెసులుబాటును క‌ల్పించారు.  

పైగా ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి 5 శాతం రిబేటును కూడా ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ.. స్వ‌ల్ప సంఖ్య‌లోనే వీటిని కొనేందుకు ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చారు. ఇదే విష‌యంపై వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏంటి సార్ ఇది.. బాబు హ‌యాంలో అలా.. మ‌న హ‌యాంలో ఇలా అంటూ.. నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌నతో పాటు టెన్ష‌న్ కూడా ప‌డుతున్నారు. మ‌రి .. దీనిపై కీల‌క స‌ల‌హాదారు ఎలారియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: