భారీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు.. షాకింగ్ నిర్ణయం...!
స్థానిక నేతలు చేసిన.. మంత్రాంగం కారణంగానే.. కంచుకోట వంటి కుప్పంలో ఓడిపోయామని ఆయన చెప్పుకొస్తున్నారు. ఎప్పటి నుంచో చంద్రబాబు బాగా నమ్ముకున్న వారు కూడా పార్టీని ముంచేశారన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారట . ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానని.. ఆయన వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు ఇప్పుడు.. అడుగుల వేగం పెంచారు. ఒక్క కుప్పంలోనే కాకుండా.. అన్ని ముఖ్య నియోజకవర్గాల్లోనూ పార్టీని గాడిలో పెట్టే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కీలక నాయకులు.. మనోహర్, మునిరత్నం, ఎమ్మెల్సీ శ్రీనివాసులు వంటి వారిపై చర్యలకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే మనోహర్, మునిరత్నం, త్వరలోనే రిజైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి కారణంగా కనిపిస్తోంది. చంద్రబాబు వీరిని వ్యూహాత్మకంగానే పక్కన పెట్టారని సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే నాయకులకు ప్రాధాన్యంఇవ్వాలని బాబు నిర్ణయించారు. ఇక, ఇతర మునిసిపాలిటీల్లోనూచర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే చీరాల, నెల్లూరు, నగరి మునిసిపాలిటీల్లో జరిగిన పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఇక్కడ కూడా పార్టీ నేతల ప్రక్షాళన ఊపందుకుంటుందని అంటున్నారు. అయితే.. ఈ మార్పులు.. పార్టీని బలోపేతం చేస్తాయా? లేక.. ఏం చేస్తాయనే విషయం ఆసక్తిగా మారింది.