కరోనా... రాబోయే రెండు నెలలు హై అలర్ట్...!
పరీక్షల నమూనాలు నిర్దేశిత సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుటకు అవసరమైతే రవాణా మెరుగు పరచాలని మంత్రి ఆదేశించారు. నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. లోపాలు జరిగితే బాధ్యత వహిస్తారని... శాఖాపరమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు కలెక్టర్ లాఠకర్. కోవిడ్ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్, ట్రయేజింగ్, టెస్టింగ్, మందులు, అంబులెన్స్ యాజమాన్యం తదితర విభాగాలు చురుకుగా పనిచేయాలని తెలిపారు. అంబులెన్స్ ల వివరాలు మండలాల వారీగా ఉండాలని ఆయన ఆదేశించారు. 104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేస్తుందని... ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చన్నారు కలెక్టర్. ప్రజలు అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల పడకల్లో 50 శాతం ఆరోగ్య శ్రీ క్రింద కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. సీసి కెమెరాల పనితీరు ఇతర అంశాలను యాప్ లో ఆసుపత్రి నోడల్ అధికారులు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో 423 ఐసియు పడకలు, 2004 ఆక్సిజన్ పడకలు., 1,426 కాన్సంట్రేటర్లు, 2,538 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని వివరించారు. 15 పి.ఎస్.ఏ ప్లాంట్లు, 61 కిలో లీటర్ల సామర్థ్యం గల 6 ఎల్.ఎం.ఒ ప్లాంట్లు ఉన్నాయని జిల్లా కలెక్టర్ లాఠతర్ చెప్పారు.