బాలయ్యకు చెక్... వైసీపీ కొత్త స్కెచ్‌...!

VUYYURU SUBHASH
హిందూపురంలో బాలయ్యకు చెక్ పెట్టడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. మరొకసారి హిందూపురం బరిలో బాలయ్యని గెలవకుండా నిలువరించాలని చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లోనే బాలయ్యని దెబ్బకొట్టాలని వైసీపీ ప్రయత్నించింది. పైగా జగన్ గాలి ఉంది...దీంతో బాలయ్యకు చెక్ పడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ హిందూపురం టీడీపీ కంచుకోట అని మరొకసారి రుజువైంది...అలాగే అక్కడి ప్రజలు బాలయ్య పట్ల ఎంత అభిమానంగా ఉన్నారో తెలిసింది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూపురంలో బాలయ్యని దెబ్బకొట్టడానికి ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిందే. నయానో, భయానో హిందూపురం ప్రజల చేత ఓట్లు వేయించుకుని స్థానిక ఎన్నికల్లో గెలిచారు. అలాగే హిందూపురం మున్సిపాలిటీలో కూడా వైసీపీ గెలిచింది.
ఈ ఫలితాలని చూసుకుని ఇక్బాల్ కాస్త జోష్‌లో ఉన్నారు. అసలు ఈ ఫలితాలని బట్టి చూసుకుంటే హిందూపురంలో బాలయ్య మళ్ళీ గెలవడం కష్టమే అని పరిస్తితి. కానీ ఆ పరిస్తితి ఉంటుందా? అంటే అబ్బే కష్టమనే చెప్పాలి. అక్కడి ప్రజలకు బాలయ్యపై ఎనలేని అభిమానం ఉంది. ఏదో లోకల్ ఎన్నికలు అంటే తప్పదు...కాబట్టి వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ సాధారణ ఎన్నికలోచ్చేసరికి ఆ పరిస్తితి ఉండదు. బాలయ్య వైపే హిందూపురం ప్రజలు ఉంటారు.
అయినా సరే ఎలాగైనా బాలయ్యకు చెక్ పెట్టాలని ఇక్బాల్ ట్రై చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య వైపు ఉన్న ముస్లిం ఓటర్లని తనవైపుకు తిప్పుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కింది స్థాయి టీడీపీ క్యాడర్‌ని అధికార బలంతో ఆకర్షిస్తున్నారు. అంటే కింది స్థాయి క్యాడర్‌ని మారిస్తే బాలయ్యని దెబ్బకొట్టవచ్చని ఇక్బాల్ భావిస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే...ఇక్కడ ముస్లింలకు బాలయ్య అంటే విపరీతమైన అభిమానం...వారిని మార్చడం ఇక్బాల్ వల్ల కాదు. కాబట్టి ఇక్బాల్ ఎన్ని రూట్లలో వచ్చిన బాలయ్యకు చెక్ పెట్టడం కష్టమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: