ఓటీఎస్పై సీఎం క్లారిటీ... ఎవరిష్టం వాళ్లదే...!
ఓటీఎస్పై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఓటీఎస్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరికి వివరించాలని కూడా సీఎం ఆదేశించారు. ఓటీఎస్ పథకం వినియోగించుకున్నా వారికి ఎన్నో లాభాలున్నాయన్నారు ముఖ్యమంత్రి. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఛార్జీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 22-ఏ తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు లోన్ క్లియరెన్స్, ఫీల్డ్ స్కెచ్ సర్టిఫీకెట్లను ఓటీఎస్ వినియోగించుకున్న వారికి ఇస్తున్నట్లు కూడా తెలిపారు. పథకం అమలుపై అపోహలు ప్రచారం చేస్తున్నారని.... ముఖ్యమంత్రి ఆరోపించారు. దీనికి ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలు సృష్టించేందుకు కూడా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు సీఎం జగన్. ఎలాంటి సమస్యలు లేకుండా ఓటీఎస్ పనులు జరగాలన్నారు. ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని కూడా ఆదేశించారు.