వైఎస్ జగన్: ఇచ్చిన హామీలే ఇబ్బందిగా మారాయా...!
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఆ సమయంలో అన్ని వర్గాల వారికి లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిన మాటలే ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్నారు వైఎస్ జగన్. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ కూడా అమలు చేస్తామన్నారు. కానీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదు. అదే సమయంలో సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు... ఇప్పుడు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ అమలుపై ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుపతిలో ఉద్యోగులకు హామీ ఇచ్చినా కూడా... వెనక్కి తగ్గడం లేదు.