హైద‌రాబాద్‌లో ఇళ్లు కొన్న ఆరుగురు ఏపీ మంత్రులు..?

VUYYURU SUBHASH
చంద్ర‌బాబు గ‌తంలో హైద‌రాబాద్ లో భారీ ఎత్తున ఇళ్లు క‌ట్టుకున్నారు. దీనిపై అప్ప‌ట్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఏపీకి ముఖ్య‌మంత్రి గా ఉంటే తీసుకు వెళ్లి పొరుగు రాష్ట్ర‌మైన హైద‌రాబాద్‌లో ఇళ్లు క‌ట్టుకోవ‌డం ఏంట‌ని నాడు వైసీపీ నేత‌ల నుంచి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే నాడు చంద్ర‌బాబు ను ఏ వైసీపీ నేత‌లు అయితే తిట్టారో ఇప్పుడు అదే వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ లోనే ఎక్కువుగా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆరుగురు ఏపీ మంత్రులు హైద‌రాబాద్ లోనే కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇళ్లు కొనుక్కున్నార‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.
వారంతా కూడా ఇప్పుడు మంత్రులు అయ్యాకే హైద‌రాబాద్ లో ఇళ్లు క‌ట్టుకున్నార‌ట‌. ఇంకా చెప్పాలంటే ఏపీ లో రాజ‌ధాని అంటూ లేదు.. పెద్ద సిటీ కూడా లేదు. అయితే హైద‌రాబాద్ ఇప్ప‌టికే బెంగ‌ళూరు, చెన్నైల‌తో పోటీ ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే త‌మ పిల్లల కెరీర్ కోసం కావ‌చ్చు.. త‌మ ఫ్యూచ‌ర్ కోసం కావ‌చ్చు.. ఏపీ మంత్రులు అంద‌రూ కూడా హైద‌రాబాద్ లోనే ఉండేందుకు ఎక్కువుగా ఇష్ట‌ప డుతున్నార‌ని తెలుస్తోంది. అందుకే వారు కోట్లాది రూపాయ‌లు పోసి మ‌రీ అక్క‌డే ఇళ్లు కొనుక్కున్నార‌ని టాక్ ?
ఏపీలో రియాల్టీ రంగం ఇప్ప‌టికే తిరోగ‌మ‌న బాట‌లో ఉంది. ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టుకుని కూర్చొనేందుకు ఎవ్వ‌రూ ఇష్ట ప‌డ‌డం లేదు. ఏదేమైనా ఒకే సారి ఆరుగురు ఏపీ మంత్రులు హైద‌రాబాద్ లో మ‌కాం ఏర్పాటు చేసుకోవ‌డం మాత్రం ఇప్పుడు సంచ‌ల‌నం గా మారింది. ఒక్క మంత్రులు మాత్ర‌మే కాదు చాలా మంది ఎమ్మెల్యే లు కూడా హైద‌రాబాద్ లోనే ఇళ్లు కొనుక్కుని భ‌విష్య‌త్తు అయినా అక్క‌డే ఉండేందుకు ఇష్ట ప‌డుతున్నార‌ట‌. అంటే ఏపీ లో మాత్రం వారు ఉండేందుకు పెద్ద‌గా ఆస‌క్తి అయితే చూప‌డం లేద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: