ప్రకృతి మానవునిపై కక్ష గట్టిందా?
ఎక్కడిక్కడ వంతెనలు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు ప్రజలకు ఈ వర్షాలకు పని దొరక్క అల్లాడిపోయారు. తిండి లేక, నిలువ నీడ లేక నరకాన్ని చవిచూశారు. ఈ భారీ వరదల కారణంగా ఎందరో నివాసాలు కూలిపోయి రోడ్డున పడ్డారు. ఇక రైతన్నల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. కొన్ని ప్రాంతాలలో విత్తనాలు వేయగా, మొలకలు వచ్చి రైతు హమ్మయ్య అనుకునే లోపు వరుస వర్షాల వలన పొలాలు నీటితో నిండిపోవడంతో ఆ మొలకలు కాస్త నీట మునిగి పడిపోయాయి. మళ్ళీ రైతన్నకు అంతకంతకూ శ్రమ, మరియు పెట్టుబడి నష్టం అయ్యింది.
మరికొన్ని ప్రాంతాల్లో చేతికి అందాల్సిన పంట వరదల దాటికి కొట్టుకు పోయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో కోతకు సిద్ధమైన పంట ముంచెత్తిన వరుస తుఫాన్ల కారణంగా కళ్లముందే చల్లా చెదురైపోయి రైతున్నల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి మానవునిపై కన్నెర్ర చేసినట్లుగా వరుస వైఫరీత్యాలు ప్రజలను అన్నివిధాలుగా ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. మరి వచ్చే సంవత్సరం అయినా అన్ని విధాలుగా ప్రజలు సుభిక్షముగా ఉండాలని ఆశిద్దాం.