పథకాల పేర్లపై కేంద్ర మంత్రి ఆగ్రహం... మీ పేర్లు ఎందుకన్న స్మృతి..!
ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అని పేర్లు పెట్టడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్లో చేసిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా స్పందించారు. రఘురామ ఫిర్యాదుపై వెంటనే సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. 2021-22 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు ఇచ్చిన 187 కోట్ల రూపాయలకు లెక్క కూడా తక్షణమే చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మార్చిన పేర్లు, వాటి కోసం తీసుకున్న చర్యలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్లో రఘురామ కృష్ణంరాజుకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకోవడం పై ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.