వారిద్ద‌రికి చెక్ పెడుతోన్న ప‌వ‌న్‌.. అదిరిపోయే స్కెచ్‌..!

VUYYURU SUBHASH
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2024 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇప్ప‌టి నుంచే ర‌క‌ర‌కాల స్కెచ్ ల‌తో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రం మొత్తం మీదే కాదు.. ప‌లువురు కీల‌క నేత‌ల నియోజ‌క వ‌ర్గాల‌ను కూడా జ‌గ‌న్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్యే గా ఉన్న కుప్పం నియోజ‌క వ‌ర్గంలో కూడా జ‌గ‌న్ ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కుప్పం నియోజ‌క వ‌ర్గాన్ని ముందు నుంచే టార్గెట్ చేస్తూ వ‌స్తోన్న జ‌గ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీకి పూర్తి గా చెక్ పెట్టేశారు.

ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఫ్యాన్ జోరు ముందు వైసీపీ పూర్తి గా బేజారు అయ్యింది. ఇక కొత్త గా ఏర్ప‌డిన కుప్పం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. కుప్పం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం ఆరు వార్డుల‌కే ప‌రిమితం అయ్యింది. ఇక అంత‌కు ముందు సర్పంచ్ స్థానాల‌తో పాటు ఎంపీ టీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం భీమ‌వ‌రం లో కూడా జ‌గ‌న్ అదిరిపోయే స్ట్రాట‌జీ వేస్తున్నారు. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకే చెందిన క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన ర‌ఘురామ రాజును ఓడించాలి. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా ఓడించాలి. ఇక్క‌డ క్షత్రియ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. అదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం కూడా ఎక్కువుగా ఉంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ , ర‌ఘురామ రాజును నిల‌వ‌రించాలంటే ఇప్పుడు జ‌గ‌న్ కొత్త స్ట్రాట‌జీ వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ క్ష‌త్రియుల‌తో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య ఇస్తున్నారు. అందుకే ఇటీవ‌ల భీమ‌వ‌రం కు చెందిన మోషేన్ రాజుకు మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. మ‌రి ఈ స్కెచ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: