ఏపీలో గేర్ మార్చిన బీజేపీ... అధికారమే టార్గెట్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఏపీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజాగా ప్రకటించిన కోర్ కమిటీలో నలుగురు ఎంపీలతో పాటు మరో 9 మందికి కూడా అవకాశం దక్కింది. వీరితో పాటు మరో ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు కమిటీలో స్థానం దక్కింది. అలాగే కోర్ కమిటీ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. ఇకపై ప్రతి నెలకు ఒకసారి అయినా సరే... కోర్ కమిటీ సమావేశం జరగాలని ఆదేశించింది. ఏపీ కోర్ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్, ఎంపీలు జీవిఎల్, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీ నారాయణ, మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక జయరాజులతో కూడిన కోర్ కమిటీ ప్రతి నెలా సమావేంశం అవ్వాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.