జగన్కు వైసీపీ ఎమ్మెల్యే బిగ్ షాక్...!
రాజధాని ప్రాంత రైతులు న్యాయ స్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే ఈ పాదయాత్ర కు ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా రైతులు చేస్తూనే వస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీథర్ రెడ్డి వారివద్దకు వెళ్లి మరీ వారి బాగోగులను కనుక్కోవడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.
పాదయాత్ర లో భాగంగా రైతులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎస్ఎస్బీ కల్యాణ మండపంలో బస చేయడంతో పాటు నెల్లూరు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మహా పాదయాత్రకు రైతులు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా వారి వద్దకు వెళ్లి బాగో గులను కనుక్కోవడం విశేషం. ఇక రాజధాని ప్రాంత రైతులు అందరూ కూడా అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని మహా పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల కాన్సెప్ట్ ను వదిలి పెట్టడం లేదు. అలాంటిది ఇప్పుడు రైతుల కు తమ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం జగన్ కు ఓ విధంగా షాక్ లాంటిదే. కోటంరెడ్డి కొద్ది రోజులుగా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన రైతుల మహా పాదయాత్రకు సపోర్ట్ చేయడంతో పాటు వారికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానని చెప్పడం విశేషం.