మళ్లీ ఆంక్షలు తప్పవా...!
దక్షిణాఫ్రికాలో కలకలం రేపుతున్న ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రపంచ దేశారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అన్ని దేశాలు కూడా దక్షిణాఫ్రికా నుంచి జరిపే ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీ తీయాలంటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం... అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక కరోనా కొత్త వేరియంట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓమిక్రాన్ వేరియంట్ పై అధికారులతో సమీక్ష చేశారు మోదీ. కొత్త వేరియంట్ భారత్లో ప్రవేశిస్తే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. అలాగే దీనికి సంబంధించిన వైద్యం, ఆసుపత్రుల్లో తీసుకునే జాగ్రత్తలపై ప్రధాని వివరాలు సేకరించారు. ఇక కొత్త వేరియంట్ భారత్లో ప్రవేశించకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించే విషయంపై కూడా ప్రధాని ఆరా తీశారు. తప్పని సరి అయితే.... ఆంక్షలు విధించేందుకు కూడా వెనుకాడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ ఆదేశించారు.