టీడీపీ నయా ప్లాన్... ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు...!
తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఇదే విషయంపై కీలకంగా చర్చించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించిన తీరుపై నారా భువనేశ్వరి కూడా లేఖ విడుదల చేశారు. దీంతో ఈ అంశంపై వైసీపీని మరింత ఇరుకున పెట్టేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేస్తున్నారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రజా పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోంది. దీనికి ఆడపడుచుల ఆత్మ గౌరవం అనే పేరు కూడా పెట్టారు. ఇదే విషయంపై టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. మహిళల వ్యక్తిత్వంపై దాడి చేశారంటూ ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం మానవ తప్పిదం వల్లే జరిగినట్లు ఆరోపిస్తున్నారు. వరద మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది.